నేను మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి, ఎన్నో ఆదర్శాలు ని కలిగి మన సొసైటీ ని, అందులో విద్యా

వ్యవస్థ ని మార్చి, ఒక మంచి సొసైటీని తీర్చిదిద్దేందుకు శ్రమిస్తూ, అందరికీ సమాన సౌకర్యాలు, మంచి జీవితం

ఉండాలని పరితపిస్తున్న ఆకర్ష్ శ్రీరామోజు. ఇంకెందుకు ఆలస్యం ఆయన గురించి తెలుసుకుందాం రండి.

బాల్య సంవత్సరాలు

ఆకర్ష్ శ్రీరామోజు తెలంగాణలోని మంచిర్యాలలో జన్మించారు. అతని తండ్రి (రవి శ్రీరామోజు) 'స్వాతి మెడికల్' అనే ప్రసిద్ధ పాలీక్లినిక్‌ని మరియు ఫార్మసీని ప్రారంభించారు . అతని తల్లి (అనిత శ్రీరామోజు) గృహిణి. ఆకర్ష్ కుటుంబం మద్యతరగతికి చెందినది , వారు ఎటువంటి పరిస్థితులలో అయిన వారి వాల్యూస్ కి ప్రాధాన్యం ఇచ్చే మనస్తత్వం కలిగినవారు. ఆకర్ష్ స్కూల్ ఎడ్యుకేషన్ చాలా వరకు ఆదిలాబాద్ మరియు మంచిర్యాల జిల్లాల్లో సాగింది. ఆకర్ష్ హై స్కూల్ లో ఉన్నప్పుడు, అతని కుటుంబం హైదరాబాద్‌కు వచ్చింది. ఆకర్ష్ స్కూల్ లో చదువుతున్న సమయంలో, ట్రెడిషనల్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రోట్ లెర్నింగ్ మరియు సైద్ధాంతిక విధానంపై ఎక్కువ ఫోకస్ ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ విధంగా, చాలా చిన్న వయస్సు నుండి ఆకర్ష్ క్లాస్ రూమ్ సెటప్‌ మార్చడంపైనా ఆసక్తిని పెంచుకున్నారు. మరియు భారతీయ విద్యా వ్యవస్థలో ప్రభావవంతమైన మార్పును తీసుకురావాలని అనుకున్నారు. కొన్నేళ్లూ, ఆకర్ష్ తన సమయాన్ని స్కూల్ లో కాకుండా ఇంట్లోనే గడిపాడు, పుస్తకాల ద్వారా నాలెడ్జ్ని పెంచుకోవడం, గణితం మరియు సైన్స్ సొంతంగా నేర్చుకోవడం, ఆర్ట్ మరియు క్రాఫ్ట్‌వర్క్‌లలో మునిగిపోవడం మరియు ముఖ్యంగా మన సమాజం ఎలా నిర్మించబడిందో మరియు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అతనికి అలవాట్లు గా ఉండేవి. అదే సమయంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రజలు, సమాన అవకాశాలు మరియు చాలాకాలంగా కోల్పోయిన గుర్తింపుని తిరిగి సంపాదించుకోవడం కోసం రాష్ట్ర విభజన కోసం పోరాడుతున్నారు. సాధారణంగా ప్రతి మార్పు ని గమనించి తెలుసుకునే ఆసక్తి ఉన్న ఆకర్ష్ రాష్ట్ర విభజన కోసం ప్రజలు చేస్తున్న పోరాటం గురించి తెలిశాక, దాని గురించి మరింత రీసెర్చ్ చేసి దాని వెనుక గల కారణాలు తెలుసుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమంపైనా, రాజకీయాలపైనా అతనికి ఆసక్తి మొదలైంది.

ఇంజినీరింగ్ డేస్

ఆకర్ష్ తన ఇంజనీరింగ్ రోజుల్లో మన రాష్ట్రం మరియు దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేందుకు చాలా ఎక్కువ రీసెర్చ్ చేశారు. ఇంజనీర్‌ చదువుతూ ఉన్నప్పుడు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న అవేసమస్యలను ఆకర్ష్ మళ్లీ గుర్తించాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చాలా మార్చాల్సి ఉంది అని చిన్నప్పుడే అతని మనసు లో పుట్టిన ఆశయం అతని ఇప్పటి ఆలోచనలకు ఊపిరి అయ్యింది. ఎలాగైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చాలన్న అతని లక్ష్యాన్నీ నెరవేర్చుకునేందుకు ఆకర్ష్ మార్గాలు వెతకడం స్టార్ట్ చేసాడు. ఆకర్ష్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కంపెనీని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం అవగాహన పెంచుకోవడానికి ఆకర్ష్ బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 6 నెలల సుదీర్ఘమైన, వినూత్నమైన ప్రాజెక్ట్‌లో పనిచేశాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి తో పని చేస్తున్నప్పుడు, ఏ దేశంలోనైనా మార్పును తీసుకొచ్చేవారు కేవలం రాజకీయ నాయకులే కాదు, ఉద్యోగాలు సృష్టిస్తూనే ఆవిష్కరణల ద్వారా దేశ పురోగతిని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న బిజినెస్ మ్యాన్స్ కూడా అని అతను గ్రహించాడు. ఈ ఇంట్రస్ట్ తోనే ఆకర్ష్ లిబరల్ ఆర్ట్స్‌ జ్ఞానాన్ని ఇంజినీరింగ్లో చేర్చడం ద్వారా మన ఆలోచన విధానాన్ని మార్చే లక్ష్యంతో ఒక టీచింగ్ మెథడలాజి ని రూపొందించారు. లెర్నింగ్ కి సంబంధించిన సైకాలజీ ని క్షుణ్ణంగా రీసెర్చ్ చేసి ఆకర్ష్ ఈ స్టూడెంట్ ఫోకస్డ్ టీచింగ్ విధానాన్ని రూపొందించారు. 

యూనివర్సిటీలో అనుభవాలు

తన బ్యాచిలర్స్ తర్వాత, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి, ఆకర్ష్ సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ మరియు కాగ్నిటివ్ సైన్స్‌లో లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని న్యూరల్ మరియు కాగ్నిటివ్ సైన్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో చేరారు. రెండు సంవత్సరాల మాస్టర్స్‌లో, రాజకీయంగా చురుకైన విద్యార్థి సంఘం మరియు మొత్తం యూనివర్సిటీ వాతావరణం, ఒక సమస్య ని సాల్వ్ చేయాలి అంటే గ్రాస్-రూట్ స్థాయి నుండి మార్పు తీసుకురావడం ఎంత కీలకం అనే పలు విషయాలు అతని అభిప్రాయాలను ప్రభావితం చేసాయి. రాజకీయ యొక్క ప్రాముఖ్యత తెలిసాక ఆకర్ష్ కి రాజకీయాలపై ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ స్టేజ్ లో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ, మన దేశం ద్వేషపూరిత ప్రసంగాలు మరియు నేరాలతో మరింతగా పోలరైజ్ అవుతుండడాన్ని ఆకర్ష్ గమనించారు. ఈ సమయంలో, ఆకర్ష్ సామాజిక మార్పుకు ఎడ్యుకేషన్ ఏ మూలం అని అర్థం చేసుకున్నారు. ప్రభావవంతమైన విద్యా విధానం మన దేశాన్ని సానుకూలంగా మార్చగలదని ఆయన విశ్వసించారు. ఏది ఏమైనప్పటికీ, సమాజం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ మరియు విధాన రూపకల్పన వంటి అనేక అంశాలు మార్పు మరియు పురోగతిని తీసుకురావడానికి బహుళ స్థాయిలలో ప్రభావితం చేస్తాయని అతను గ్రహించాడు. ఈ సాక్షాత్కారం అతని ఆలోచనా విధానంలో కంపెనీ స్టార్ట్ చేయాలి అనే లక్ష్యం నుండి రాజకీయాల వైపు మళ్లింది. 

రాజకీయాల తోనే మార్పు వస్తుంది అని అనుకుంటున్న దశలో, హైదరాబాద్‌లో అక్టోబర్ 2020 లో వచ్చిన వరదలు అతని జీవితంలో ఒక మలుపుకు దారితీసింది. గత 100 సంవత్సరాలలో చూడని విపరీతమైన సంఘటనని ( నగరం లో వరదలు) హైదరాబాద్ ప్రజలు చూశారు. సరస్సుల ఆక్రమణ, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం మరియు సంసిద్ధతకు ఉదాహరణ. అందరిలా నాకెందుకు అని చూసి చూడకుండా ఉండలేకపోయారు ఆకర్ష్ . తన చుట్టూ ఉన్న వాళ్ళు కి కష్టం కలిగితే నాయకుడై నిలిచి సమస్యని పరిష్కరించే స్వభావం ఉన్న అతను ఆ విషయం పై మరింత దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినా మురుగునీటి వ్యవస్థలు ఇప్పటికీ అధ్వాన్నంగా ఉండటం గుర్తించారు, ఈ విషయం అతనికి ఆశ్చర్యం కంటే ఎక్కువగా ఆవేదనని మిగిల్చింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తరువాతి నెలల్లో, ఆకర్ష్ తన రాజకీయ ప్రయాణంలో మొదటి అడుగు వేశాడు, రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం, తన ప్రాంతంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడం మరియు లొకాలిటీ ఆధారిత అభివృద్ధి విధానం కోసం కృషి చేయడం అతని జీవితం అయిపోయాయి. ఆకర్ష్ గత 15 ఏళ్లుగా శేరిలింగంపల్లిలో నివాసం ఉంటున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ ఆయన గమనించారు. అతను సొల్యూషన్ ఫోకస్డ్ విధానం ని అనుసరిస్తూ సమాజం లో సమగ్ర మరియు సుస్థిర అభివృద్ధిని సాధించటమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు .

వర్తమానం

స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయ్యినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలు అయ్యినా మన రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉత్తమమైన విధానాలు అనుసరించి పని చేయడం ద్వారా అట్టడుగు స్థాయి నుండి మార్పు తీసుకురావాలని ఆకర్ష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్ తరాల స్వంత అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని, ఏ విషయం లోనూ రాజీ పడి వెనక్కి తగ్గకుండా ఉండే పరిస్థితులని, మొత్తంగా మన సమాజం మరియు దేశం యొక్క అవసరాలను మనమే తీర్చుకునే విధంగా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో సమగ్ర మరియు సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు ఏం చేయాలి అన్న విషయం పై ఆకర్ష్ గారికి అవగాహన ఉంది . ప్రజాస్వామ్యంలో కేవలం రాజకీయాలలో ప్రవేశం ఉన్నత వర్గాలకే కాకుండా ప్రతి పౌరుడు రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలని ఆకర్ష్ అభిప్రాయం.

రాజకీయాలు గురించి రాజకీయ నాయకులు కావాలనుకునే వారికే కాదు, దేశ సంక్షేమం పట్ల ఆసక్తి ఉన్న వారికి కూడా రాజకీయం పై అవగాహన ఉండాలని అని ఆకర్ష్ గట్టిగా నమ్మారు. ఆ విధంగా, ఆకర్ష్ నిజమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒక సామాజిక మరియు భాగస్వామ్యం ఉన్న ప్రజాస్వామ్యం ని నెలకొలపడం ద్వారా ప్రతి పౌరుడు నిర్ణయం తీసుకోవడంలో చురుకుగా పాల్గొంటారు అని ఆకర్ష్ భావించారు. సైకాలజీ, టెక్నాలజీ మరియు పాలసీ మేకింగ్ నుండి పొందిన నాలెడ్జ్, అనుభవం మరియు పరిచయంతో, ఆకర్ష్ అలంటి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ఒక అడుగు ముందుకేశారు మరియు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ ఉద్దేశ్యంతో, ఆకర్ష్ అట్టడుగు స్థాయి మార్పును లక్ష్యంగా చేసుకుని సమగ్ర శేరిలింగంపల్లి ప్రచారాన్ని ప్రారంభించారు.

సమగ్ర శేరిలింగంపల్లి 

సమగ్ర మార్పు తో ఒక ఇన్నోవేషన్ సిటీ ని స్తమించడానికి ఇప్పుడు మనము వేసే బలమైన ముందడుగు

ఈ ఇన్నోవేషన్ సిటీ లో ప్రజలు - ఆలోచించుతారు , ప్రయోగం చేస్తారు , నేర్చుకుంటారు మరియు అభివృద్ధి చెందుతారు