నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయటం ద్వారా, అభివృద్ధి చెందిన

భారతదేశాన్ని నిర్మించడానికి, ఒక పౌరుడు చేస్తున్న విజ్ఞప్తి

మన దేశం యొక్క వ్యవస్థాపక సభ్యులు మరియు స్వాతంత్ర్య సమరయోధులు మన మాతృభూమి కోసం తమ రక్తాన్ని మరియు చెమటను ధారపోశారు , వాటి ఫలితమే 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుండి మనం స్వేచ్ఛగా, గౌరవప్రదంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా జీవితాన్ని గడపగలుగుతున్నాము. మన స్వాతంత్ర్య సమరయోధులు సామాజిక వివక్ష, ఆర్థిక అసమానతలు, పర్యావరణ నష్టం మరియు రాజకీయ అన్యాయం లేని ప్రగతిశీల భారతదేశం గురించి కలలు కన్నారు. ఉదారవాద సమాజంలో ఈ సూత్రాల ప్రకారం జీవించడానికి, మనం 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించాము మరియు అవసరమైనప్పుడు సవరణలు చేసాము.

 

మనల్ని మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. నేడు మనం నిజంగా అభివృద్ధి చెందిన భారతదేశంలో జీవిస్తున్నామా? 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, భారతదేశం ఆర్థిక అనిశ్చితి మరియు రాజకీయ మార్పులతో కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటిస్థానంలో ఉండటానికి భారతదేశం అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది; అయినప్పటికీ, ఒక దేశంగా సమగ్ర వృద్ధి మరియు అభివృద్ధిని సాధించడానికి మనం చాలా కష్టపడాలి . మన కేంద్రం GDP లేదా బలమైన రోడ్లు మరియు సదుపాయాల పై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తూ, మన జీవన నాణ్యత వైపు మరియు పెరుగుతున్న పేదరికం వైపు ప్రాధాన్యత అంతగా ఇవ్వట్లేదు.

 

స్వాతంత్య్రానంతర భారతదేశం యొక్క 75 సంవత్సరాల ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుని ఆలోచిస్తే, 1947లో మన వ్యవస్థాపక సభ్యులు ఊహించిన అభివృద్ధి కోసం మనం కఠినంగా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతుంది. మనం అక్కడికి ఎలా చేరుకోవాలి? మనం ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి మరియు పరిష్కారాలను చర్చించడానికి ముందు, మొదట చరిత్రను అర్థం చేసుకుందాం. ఎందుకంటే చారిత్రక మార్పును సృష్టించాలంటే ముందుగా మన చరిత్రను తెలుసుకోవాలి మరియు అర్థం చేసుకోవాలి. 

 

అమలు చేయబడిన విధానాల గురించి తెలుసుకోవడానికి భారతదేశ స్వాతంత్య్రానంతర కాలంలో ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. లీబరలైజేసన్ ఆవిర్భావం తర్వాత, 1990లలో వ్యాపార వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయో కూడా చూద్దాం. 

అధ్యాయం 1: భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా?

స్వాతంత్ర్యం సాధించిన వెంటనే, భారతదేశంపై నియంత్రణను వ్యవస్థాపక సభ్యులు మరియు నాయకుల నుండి రాజకీయ వర్గం వేగంగా స్వాధీనం చేసుకుంది. మన దేశాన్ని క్రమంగా మార్చేందుకు రాజకీయ నాయకులకు అనేక గొప్ప అవకాశాలు వుండే; దాంట్లో భాగంగా విద్యా, పరిశోధనా సంస్థలను స్థాపించడం, అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ వృద్ధి వంటి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 1947 నుండి 1990 వరకు భారతదేశం లైసెన్స్ , పర్మిట్ రాజ్ అనే విధాన ఫ్రేమ్‌వర్క్‌ను అనుసరించింది. ఈ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను USSR (అప్పటి రష్యా) ప్రేరణతో పంచవర్ష ప్రణాళిక -ఆధారిత విధానాన్ని అమలుపరిచారు. ఏ చర్యకైనా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఈ పాలసీ పేర్కొంది. 

 

ఈ కాలంలోనే మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది (1951). 80-90% జనాభా జీవనోపాధి వ్యవసాయంపై మాత్రమే ఆధారపడి ఉన్నందున ఆకలి చవులు తగ్గించడం , తీవ్రమైన పేదరికాన్ని తగ్గించడం ప్రాథమిక అంశాలుగా వున్నాయి. భారతదేశం ఈ లక్ష్యాలను సాధించగలిగింది కానీ పాక్షికంగా మాత్రమే. ఈ దశలో, ప్రజల పౌరుల కోరికలు మరియు ఎలాంటి ఎంపికల లేకుండా నియంత్రించబడ్డాయి.

 

వ్యవసాయంలో అభివృద్ధి సాధించి ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించాము. ఈ సంక్షోభ పరిష్కారంలో హరిత విప్లవం కీలక పాత్ర పోషించింది. అయితే, విధాన నిర్ణేతలు విస్తృతంగా విస్తరించిన పేదరికం యొక్క వాస్తవాన్ని చూడలేకపోయారు; దానిని తగ్గించడానికి, మనకు పని నాణ్యత, జీవన నాణ్యత అవసరం, పోషకాహార లోపాన్ని తగ్గించడం మరియు ఆదాయ స్థాయి పెరుగుదల అవసరం. అందువల్ల దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలను ఉద్ధరించడానికి ఆదాయ స్థాయిని పెంచడం మాత్రమే సరిపోదు. జనాభా అధిక రేటుతో పెరుగుతోంది మరియు GDP నిలిచిపోయింది; వార్షిక సగటు 3-4% చొప్పున ఉంది మరియు ప్రభుత్వం కూడా పేదల అవసరాలను తీర్చలేకపోయింది. ఫలితంగా పేదరికం స్థాయిలు మరింతగా పెరిగాయి 

 

ఈ కాలంలోనే , భారీ పన్నుల కారణంగా వ్యాపారవేత్తలు వ్యాపారాల స్థాపనకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం చాలా పరిశ్రమలు స్థాపించి వ్యాపారాలను నిర్వహించింది. ఉదాహరణకు, ఒకే ఒక కార్ కంపెనీ ఉండేది అందులో ప్రభుత్వం కార్లను తయారు చేసింది. అందువల్ల ప్రభుత్వ రంగం ఒక్కటే ఉద్యోగాలు కల్పించలేకపోయింది, తద్వారా నిరుద్యోగం పెరిగింది. ఈ కారణాలన్నీ భారతదేశంలో సంక్షోభానికి దారితీశాయి, ఫలితంగా మన ఆర్థిక వ్యవస్థను సరళీకరించాము, మార్కెట్లు మరియు ప్రైవేట్ సంస్థలపై నియంత్రణను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో 1990 సంవత్సరం లిబరలైజేషన్ మొదలైంది. 

 

తరువాత వచ్చే అధ్యాయంలో, మనం లిబరలైజేసన్ అనంతర కాలంలోని ఎం జరిగిందో తీసుకుంటాము. 



Contact : [email protected]


Copyrights © 2023. All rights reserved by  Samagra Serilingampally